తెరాస అపోహలు కలిగిస్తోంది: లగడపాటి

పెద్ద మనుషుల ఒప్పందం కూడా ఐదేళ్ల వరకేనని, ఆ తరువాత పునఃసమీక్షకు మరో ఐదేళ్లు గడువిచ్చారని తెలిపారు. తెలంగాణకు నిధులు ఖర్చు చేయకపోవడం అన్నది కూడా పూర్తి వాస్తవం కాదని పేర్కొన్నారు. 1969లో మాత్రమే తెలంగాణకు కేటాయించిన నిధుల్లో రూ.28 కోట్లు ఖర్చు పెట్టలేదని భార్గవ కమిషన్ నివేదిక వెల్లడించిందని చెప్పారు. నీటి పారుదల కోసం ఇచ్చిన 610జీవోతో ఆంధ్ర, తెలంగాణలు సమానంగా నష్టపోయాయని చెప్పారు.
హైదరాబాద్ను ఆరో జోన్గా ప్రకటించడం అన్యాయమన్నారు. ఇటువంటి డిమాండ్లు దేశ వ్యాప్తంగా తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అలాగే, హైదరాబాద్ శివార్లలో జనాభా వృద్ధి రేటు 3,200 శాతం (సుమారు 33 రెట్లు) పెరిగిందని, వారిలో సీమాంధ్రవాళ్లే ఎక్కువన్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కూడా సీమాంధ్రకు అన్యాయం జరిగిందని, అక్కడ 12 అసెంబ్లీ స్థానాలు తగ్గగా, గ్రేటర్ హైదరాబాద్లో 11 పెరిగాయని లగడపాటి చెప్పారు.












Click it and Unblock the Notifications