హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాలుగు వారాల తర్వాతే కోర్టుకు రాజు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో నిందితుడు రామలింగరాజును నాలుగు వారాల తర్వాతనే కోర్టులో హాజరు పరచడానికి వీలవుతుందని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు చెప్పారు. రామలింగరాజు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు శుక్రవారం హైదరాబాదులోని నాంపల్లి ప్రత్యేక కోర్టుకు శుక్రవారం సమర్పించారు. రామలింగరాజుకు హెపటైటిస్ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉందని, బయటకు వస్తే ఇన్ ఫెక్షన్ సోకుతుందని వారు కోర్టుకు తెలిపారు.

సత్యం కుంభకోణం కేసు విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఆస్వస్థతతో బాధపడుతున్న రామలింగరాజు నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. బెయిల్ కోసం పెట్టుకున్న రామలింగరాజు పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X