కర్ఫ్యూ సడలింపు: వీధుల్లోకి ప్రజలు
ప్రభుత్వం 16 సంచార వాహనాల ద్వారా కూరగాయల విక్రయానికి ఏర్పాటు చేసింది. ఎటిఎం, మందుల షాపుల వద్ద ప్రజలు బారులు తీరారు. పోలీసు పహారా మధ్య పాతబస్తీ ప్రశాంతంగానే ఉంది. అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదు. కాగా, ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు చార్మినార్, హుస్సేనీ ఆలం, కామాటిపుర, బహదూర్ పురా, కాలాపత్తర్, మీర్ చౌక్, మొఘల్ పుర, రెయిన్ బజార్, డబీర్ పుర, ఫలక్ నుమా, ఛత్రినాక, శాలిబండ, చాంద్రాయణ గుట్ట, సంతోష్ నగర్, మాదన్నపేట, భవానీనగర్, కంచన్ బాగ్ పోలీసు స్టేషన్ల పరిధిల్లో కర్ఫ్యూను సడలిస్తారు.
రేపు ఆదివారం కర్ఫ్యూను పూర్తిగా సడలించే విషయాన్ని పరిశీలిస్తామని, ఈ రోజు నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. మొత్తం 25 పోలీసు స్టేషన్ల పరిధిల్లో కర్ఫ్యూ విధించారు. ఈ 25 పోలీసు స్టేషన్లలో శనివారం కొంత సేపు కర్ఫ్యూను సడలించారు.
Story first published: Saturday, April 3, 2010, 9:46 [IST]