వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం తెలుగుదేశం నేతల సమావేశం

By Santaram
|
Google Oneindia TeluguNews

TDP
హైదరాబాద్‌: జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీకి సమర్పించే నివేదికకు తుదిమెరుగులు దిద్దేందుకు తెలంగాణా ప్రాంత తెలుగుదేశం నేతలు అసెంబ్లీలో సమావేశమయ్యారు. 8వ తేదీన న్యూఢిల్లీలో వారు శ్రీకృష్ణ కమిటీకి తమ నివేదికను సమర్పించనున్నారు. దాదాపు 15 అధ్యాయాలతోకూడిన ఏడు వందల పేజీల నివేదికను వారు సిద్దం చేసినట్టు తెలియవచ్చింది. ఢిల్లీకి ఎవరు వెళ్లాలి అన్న అంశంపై కూడా వారు చర్చిస్తున్నట్టు తెలియవచ్చింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఈ సమావేశానికి మంచి ప్రాధాన్యం ఏర్పడింది. ఇలా ఉండగా ఈ సమావేశాన్ని చంద్రబాబు కనుసైగ తోనే తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేసుకున్నట్టు మరో అభిప్రాయం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X