Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బందరు పోర్టుకు 'నవయుగం', హర్షం

Machilipatnam
మచిలీపట్నం: మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు వ్యతిరేకించినా రాష్ట్ర మంత్రివర్గం బందరు పోర్టు నిర్మాణ పనులను నవయుగ సంస్థకు అప్పగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకోవడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని వమ్ము కాకుండా ముఖ్యమంత్రి రోశయ్య స్పందించారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 2008 ఏప్రిల్‌ 23వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు.

టెండర్లు దక్కించుకున్న మేటాస్‌ సంస్థ ఆర్థికపరమైన చిక్కుల్లో పడడంతో పోర్టు వ్యవహారం వెనక్కి వెళ్లిందని కొన్ని రాజకీయపక్షాలు దుష్ప్రచారం చేశాయి. కొంతకాలం దీని నిర్మాణంపై సందిగ్ధత నెల కొంది. ఈ నేపథ్యంలో బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య చొరవ మేరకు వైఎస్‌ అప్పట్లోనే నవయుగ కంపెనీకి పనులు అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన మరణానంతరం ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ ఆశయాన్ని కొనసాగించేందుకు నడుం కట్టింది. దీనికి సంబంధించి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా అడ్వకేట్‌ జనరల్‌ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది. ఈ ప్రాజెక్టు సత్వర నిర్మాణం కోసం జిల్లా మంత్రి పార్ధసారధి తీవ్ర కృషి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+