వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డైలమాలో రోశయ్య మంత్రివర్గ విస్తరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి కె రోశయ్య ముందటి కాళ్లకు బంధం పడినట్లే ఉంది. తనదైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించిన రోశయ్యకు ఆశాభంగం జరిగినట్లే ఉంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని ముఖ్యమంత్రి కె. రోశయ్య కలిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై అనుమానాలు తలెత్తాయి. రోశయ్యతో దాదాపు గంట పాటు చర్చించిన మొయిలీ ఆ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి సన్నిహిత మిత్రుడు కెవిపి రామచందర్ రావుతోనూ మాట్లాడారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో చర్చించారు. ఈ చర్చల ఫలితంగా రోశయ్య మంత్రి వర్గ విస్తరణకు గండి పడినట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో చాలా ఖాళీలున్నాయని, సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉందని రోశయ్య చెప్పారు.

అదే చేయదలుచుకుంటే ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరినీ తీసివేయవద్దని, ఇద్దరు ముగ్గురిని అదనంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని మొయిలీ సూచించినట్లు సమాచారం. మంత్రివర్గం నుంచి వైయస్ ముద్రను తొలగించాలని, తనదైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని రోశయ్య భావించారు. అయితే అది సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. రోశయ్య శుక్రవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారు. ఈ భేటీలో రోశయ్య మంత్రివర్గ విస్తరణపై సోనియాతో మాట్లాడుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X