కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిత మృతికి గుండెలు పగిలి మరణించినవారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాదులోని తన నివాసంలో తల్లి విజయలక్ష్మి ఆశీర్వాదం తీసుకుని యాత్రకు బయలుదేరారు. ఆయన మధ్యాహ్నం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన అక్కడ మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

ఆయన అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. దాంతో ఆయన వాహనం దిగి అభిమానులకు అభివాదం చేశారు. ఆయన అక్కడి నుంచి ఏలూరు బయలుదేరి వెళ్లారు. ఆరు రోజుల పాటు జగన్ 88 కుటుంబాలను పరామర్సిస్తారు. 68 రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X