హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎండలకు మండుతున్న హైదరాబాద్

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
విశాఖపట్నం: హైదరాబాద్ నగరంలో మంగళవారం కూడా ఎండలు మంటలు మండిస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్ధితి ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత 42.6 డిగ్రీలు. సాధారణం కంటే ఇది ఆరు డిగ్రీలు ఎక్కువ. అనంతపురంలో 42.8 డిగ్రీలు. ఇది ఐదు డిగ్రీలు ఎక్కువ. రామగుండంలో 44.4 (+4) డిగ్రీలు. రాష్ట్రంలో ఎండల తీవ్రతకు అద్దంపట్టే అంకెలివి. అదిరిపోతున్న ఎండలు, భరించలేని ఉక్కబోత, ఆ చెంప నుంచీ ఈ చెంపకు ఈడ్చికొడుతున్న వడగాలులతోరాష్ట్ర ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి.

తీవ్రమైన వడగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటేనే హడలిపోతున్నారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి పూటా పరిస్థితేమీ భిన్నంగా లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 3-4 డిగ్రీలు ఎక్కువే ఉంటున్నాయి. రెండు మూడు రోజుల్లో ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వాతావరణ సముద్ర అధ్యయన విభాగం ఆచార్యుడు ఒ.ఎస్‌.ఆర్‌.యు.భానుకుమార్‌ తెలిపారు. పసిఫిక్‌ మహా సముద్రం మీదుగా వీస్తున్న ఈశాన్య గాలుల ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికివచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X