హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ రాయబారం: చిరు సమైక్యవాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ ముందు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్యవాదాన్ని వినిపించారు. చిరంజీవితో సహా 22 మంది పార్టీ నాయకులు గురువారం శ్రీకృష్ణ కమిటీ ముందు సమైక్యాంధ్రకు అనుకూలంగా తమ వాదనలు వినిపించారు. మెజారిటీ ప్రజలు, మెజారిటీ ప్రజాప్రతినిధులు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల డిమాండ్లు పెరుగుతాయని వారన్నారు. దేశవ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు తలెత్తుతాయని వారన్నారు.

చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై జాతీయ విధానం ఉండాలని, దీనిపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరగాలని ఆయన అన్నారు. బ్రిటిష్ పాలనకు ముందు తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాలు ఒకే రాజు పాలనలో ఉన్నాయని, వెనకబాటుతనం, సాంస్కృతిక అంతరాల ప్రాతిపదికగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలిస్తే రాష్టాన్ని ఐదు ముక్కలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X