నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ లో డిఎస్ కు నిరసన వేడి

By Santaram
|
Google Oneindia TeluguNews

Srinivas
నిజామాబాద్‌: జిల్లా పర్యటనకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ కు తెలంగాణ వాదులను నుంచి నిరసన ఎదురయింది. సొంత నియోజకవర్గంలోని కార్యకర్తలతో భేటీ అయి వస్తున్న డీఎస్‌ కాన్వాయ్‌ ను ఏబివిపీ, బీజేపీ శ్రేణులు ఆదివారం అడ్డుకున్నాయి. దీంతో ఇక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.

పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ ఆదివారం నిజామాబాద్‌ కు బయలుదేరారు. తెలంగాణలో ఉప ఎన్నికల నేపథ్యంలో తన నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. రాజకీయ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ కోసం 12మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. డీఎస్‌ సొంత నియోజకవర్గం నిజామాబాద్‌ అర్బన్ ‌లో కూడా ఉప ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికల్లో డీఎస్‌పై గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X