విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మే 12 నుంచి చిరు కృష్ణాజిల్లా యాత్ర

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విజయవాడ: సమైక్యాంధ్ర నినాదంతో కోస్తా జిల్లాలపై పట్టు బిగిస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మే రెండో వారంలో కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని, ప్రాజెక్ట్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతూ చిరంజీవి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్ర మే ఐదో తేదీన తూర్పుగోదావరిజిల్లా అంతర్వేది వద్ద ప్రారంభం కానుంది. మే 12వ తేదీన జిల్లాలోని కైకలూరుకు చేరుకుంటుంది. మరుసటి రోజున గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ తదితరప్రాంతాల్లో సాగనుంది. అనంతరం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది.

తిరిగి గుంటూరు నుంచి 17వ తేదీన విజయవాడకు చేరుకుంటుంది. ఆ రోజు చిరంజీవి విజయవాడలో బస చేస్తారు. 18వ తేదీన విజయవాడ నుంచి బయలుదేరి మరికొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారు. 19వ తేదీన పోలవరం వద్ద జరిగే భారీ బహిరంగసభతో యాత్రను ముగిస్తారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X