బాబు వెనక్కి చూసుకోవాలి: రోశయ్య

తమ కాంగ్రెసు అధిష్టానం సూచనల మేరకే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కష్టకాలంలో ప్రజల వద్దకు వెళ్లాలన్నదే ప్రజాపథం ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు, లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రజాపథం పనికి వస్తుందని ఆయన అన్నారు. ఆర్థిక, మౌలిక సదుపాయాల సమస్యల వల్లనే ట్రిపుల్ ఐటిలో సీట్లు తగ్గించామని ఆయన చెప్పారు. ఆవసరమైన సదుపాయాలను ట్రిపుల్ ఐటిలో కల్పించలేదని ఆయన అన్నారు. అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని, కార్డుల ఏరివేతలో పేదలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications