కాంగ్రెసుతో కెసిఆర్ కుమ్మక్కు: తలసాని
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పడం లేదని తెరాస నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన తప్పు పట్టారు. కాంగ్రెసు నాయకులు కూడా ఏమీ చెప్పడం లేదని, అటువంటప్పుడు కేవలం చంద్రబాబును మాత్రమే విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇస్తానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారని, అయితే డి శ్రీనివాస్ నివేదిక ఇవ్వలేదని ఆయన చెప్పారు. తెలంగాణపై ముందు డి శ్రీనివాస్, ముఖ్యమంత్రి రోశయ్య వైఖరులు ప్రకటించిన తర్వాత తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును అడగాలని ఆయన అన్నారు.
Comments
తలసాని శ్రీనివాస యాదవ్ తెలుగుదేశం కె చంద్రశేఖర రావు కాంగ్రెసు తెలంగాణ హైదరాబాద్ talasani srinivas yadav telugudesam k chandrasekhar rao telangana hyderabad
Story first published: Monday, April 26, 2010, 15:38 [IST]