హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసుతో కెసిఆర్ కుమ్మక్కు: తలసాని

By Pratap
|
Google Oneindia TeluguNews

Talasani Srinivas Yadav
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు పార్టీతో కుమ్కక్కయ్యారని తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. తమ పార్టీపైనే కెసిఆర్ విమర్శలు ఎక్కుపెడుతూ కాంగ్రెసును వదిలేస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసులో పార్టీని విలీనం చేస్తారా అని ఓ టీవీ చానెల్ ప్రతినిధి అడిగితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ చెప్పారని, దీన్నబట్టి కెసిఆర్ కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని చెప్పవచ్చునని ఆయన అన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పడం లేదని తెరాస నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన తప్పు పట్టారు. కాంగ్రెసు నాయకులు కూడా ఏమీ చెప్పడం లేదని, అటువంటప్పుడు కేవలం చంద్రబాబును మాత్రమే విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇస్తానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారని, అయితే డి శ్రీనివాస్ నివేదిక ఇవ్వలేదని ఆయన చెప్పారు. తెలంగాణపై ముందు డి శ్రీనివాస్, ముఖ్యమంత్రి రోశయ్య వైఖరులు ప్రకటించిన తర్వాత తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును అడగాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X