వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానిపై బిజెపి సభా హక్కుల ఉల్లంఘన

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పై భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యులు మంగళవారం లోకసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) విచారణకు ఆదేశించబోమని ప్రధాని సభ వెలుపల ప్రకటన చేయడంపై బిజెపి సభ్యులు ఆ నోటీసు ఇచ్చారు. తమ పిటిషన్ ను బిజెపి సభ్యులు లోకసభ సెక్రటరీ జనరల్ పిడిటి ఆచారికి అందజేశారు.

ఫోన్ ట్యాపింగ్ పై మన్మోహన్ సింగ్ సభ వెలుపల ప్రకటన చేయడంపై తమ నేత సుష్మా స్వరాజ్ తప్పు పట్టిన నేపథ్యంలో బిజెపి సభ్యులు ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇచ్చారు. అది సభను అగౌరవపరచడమేనని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రధాని సభలో ప్రకటన చేయాలని సుష్మా స్వరాజ్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X