వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెరాస ఉగ్రవాద సంస్థ: లగడపాటి
అంతర్యుద్ధం సృష్టిస్తామని తెరాస అధ్యక్షుడు కెసిఆర్ పదే పదే అనడం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 29ఎ (5)కు విరుద్ధమని ఆయన అన్నారు. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లేలా మాట్లాడుతున్న తెరాస శ్రేణులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరానికి మరో లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. అంతర్యుద్ధం సృష్టిస్తామని కెసిఆర్ అన్నారో లేదో శ్రీకృష్ణ కమిటీ బహిర్గతం చేయాలని ఆయన కోరారు. కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన కమిటీని బెదిరిస్తే అది ఎలా నివేదిక ఇవ్వగలుగుతుందని ఆయన అడిగారు.
Comments
Story first published: Tuesday, April 27, 2010, 8:14 [IST]