సోరేన్ కు బిజెపి మద్దతు ఉపసంహరణ

జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు రఘువీర్ ప్రసాద్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. కాగా, శిబూ సొరేన్ ఇప్పటికే కాంగ్రెసుతో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు, జెఎంఎం కలిసి జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెసుకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. సొరేన్ కు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి, ఆయన కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.
జెఎంఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ బిజెపి బుధవారం సాయంత్రం గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. సొరేన్ కుమారుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కూడా కాంగ్రెసు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications