హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎసిబి దాడులు పెంచండి: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: రాష్ట్రంలో దాడులు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులను ఆదేశించారు. ఆయన ఎసిబి అధికారులతో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో గౌరవం పొందే రీతిలో ఎసిబి పనితీరు ఉండాలని ఆయన అన్నారు. కేసుల పరిష్కారం విషయంలో సాధ్యమైనంత వరకు జాప్యాన్ని తగ్గించాలని ఆయన ఆదేశించారు.

ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని, జిల్లాల్లో ఎసిబి సమర్థంగా పనిచేసేందుకు 400 మంది వరకు సిబ్బందిని నియమించాలని అధికారులు ముఖ్యమంత్రికి సూచించారు. కొందరు ఉన్నతాధికారులైప కేసులు నమోదు చేసినా అవి మధ్యలోనే వీగిపోవడానికి గల కారణాలను వారు ముఖ్యమంత్రికి తెలిపారు. దీని వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని వారన్నారు. ఏటా 300 కేసులు నమోదవుతున్నా వాటిలో 70 నుంచి 80 కేసులు ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకుంటున్న కేసులు ఉంటున్నాయని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X