తెలంగాణ రాకుంటే యుద్ధమే: జయశంకర్

తెలంగాణ ఉద్యమం విద్యార్థుల చేతుల్లో పదిలంగా ఉందని, కురువృద్ధుల సహాయం లేకుండానే వారు తెలంగాణను సాధించుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చే వరకు పోరాటం సాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ట్రిపుల్ ఐటి సీట్లు తెలంగాణలో అధికంగా ఉన్నాయని, తెలంగాణ విద్యార్థులకు మాత్రం సీట్లు తక్కువగా లభిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో సీట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే ట్రిపుల్ ఐటి సీట్లను ప్రభుత్వం తగ్గించిందని ఆయన విమర్శించారు. తెలంగాణ వచ్చే వరకు అన్ని రంగాల్లో తమ వాటాను డిమాండ్ చేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications