తుంగతుర్తి(నల్గొండ జిల్లా): మగపిల్లికి పిల్లలు పుట్టిన వింత సంఘటన తుంగతుర్తి మండల కేంద్రంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఉల్లెందుల వెంకన్న పెంపుడు మగపిల్లి మూడు పిల్లలకు మంగళవారం జన్మనిచ్చింది. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో తుంగతుర్తి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు ఈ వింతను తిలకించేందుకు బారులు తీరుతున్నారు.
దీంతో వెంకన్న నివాసగృహంవద్ద జనం కిటకిటలాడుతున్నారు. ఈ వింతను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతూ ఇది విధి వైపరిత్యమా అని చర్చించుకుంటుండడం విన్పించింది. స్థానిక వెటర్నరీ డాక్టర్ ఈ విషయాన్ని ధృవీకరించారు.