వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి నిరసనగా ఊరేగింపు

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కేసముద్రం( వరంగల్ జిల్లా): శ్రీకృష్ణ కమిటీకి సమైక్యాంధ్రకావాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, సీపీఎం పార్టీలు ఇచ్చిన నివేదికకు నిరసనగా కేసముద్రం మండలకేంద్రంలో ప్రజాతెలంగాణ సమితి పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీమహమ్మద్ మాట్లాడుతూ సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేసి సమైక్యాంధ్ర అనడం సిగ్గుచేటని అన్నారు.

తెలంగాణ ప్రజలు ఎన్నికలలో ప్రజారాజ్యాన్ని చీదరించుకున్న తెలంగాణలో పర్యటిస్తాననడం సిగ్గుచేటని అన్నారు. ఈర్యాలీ స్థానిక పెట్రోల్‌బంక్‌నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగింది. ఈకార్యక్రమంలో నర్సయ్య, వెంకన్న, ఉప్పలయ్య, యాదగిరి, శ్రీను, కోక్య తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X