వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటిలో త్వరలో విశాఖ మేటి: రత్నప్రభ

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: రాబోయే మూడేళ్లలో విశాఖలో ఇరవై వేల మంది ఐటి రంగంలో ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటి, కమ్యూనికేషన్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రత్నప్రభ తెలిపారు. రాబోయే కాలంలో విశాఖలో తమ సంస్థల కేంద్రాలను ప్రారంభింపజేయడానికి ప్రముఖ ఐటి కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సెజ్‌లలో విద్యుత్ కోత, వౌలిక వసతుల కొరత ఉన్నమాట వాస్తవమన్నారు. కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో పలు సమస్యలపై నేడు విస్తృతంగా చర్చించామన్నారు. కంపెనీలకు ప్రత్యేక రాయితీలు కల్పించి విశాఖకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఐటి కంపెనీలనే కాకుండా ఐటి సంబంధిత యానిమేషన్ వంటి ఇతర కంపెనీలను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. విశాఖ పరిసర ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు అభివృద్ధి చెందుతున్నాయని, స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. విశాఖనగరం ప్రత్యేకతలపై దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించడం ద్వారా పెద్ద సంస్థలను విశాఖకు తీసుకురావచ్చునన్నారు. అనంతరం విశాఖలో పారిశ్రామిక వేత్తలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. సిఐఐ వైజాగ్ జోన్ చైర్మన్ కెప్టెన్ శ్రీరామ్ రవిచందర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సిఐఐ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ జె.గల్ల, ఐటి విభాగం స్పెషల్ సెక్రటరీ ఎం.గోపికృష్ణ, ఎం.కన్నన్, కె.వి.్భస్కర్ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X