హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరవీరుల సాక్షిగా తెలంగాణ సాధిస్తాం: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: అమర వీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెరాస ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఆ మాట అన్నారు. బుధవారంనాడు సికింద్రాబాదులోని సిక్ విలేజీలో గల ఇంపీరియల్ గార్డెన్ లో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ జెండాను ఎగురవేసి కెసిఆర్ సభను ప్రారంభించారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కెసిఆర్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. బిందు సేద్యానికి సంబంధించిన 34 నెంబర్ జీవోను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ ప్రాజెక్టును రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ లోని లెండి ప్రాజెక్టును, ఆదిలాబాద్ జిల్లాలోని లోయర్ పెన్ గంగ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. యాభై ఏళ్లయినా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం లేదని ఆయన విమర్శించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని కూడా ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X