హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్ సెకండియర్ లో బాలికలదే హవా

By Pratap
|
Google Oneindia TeluguNews

Board Of Intermediate
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో కూడా బాలికలదే హవా కొనసాగింది. బాలుర కన్నా బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి మాణిక్యవర ప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. బాలికలు 67 శాతం మంది ఉత్తీర్ణులు కాగా బాలురు 63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 64.69 శాతం మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా 77 శాతంతో ప్రథమ స్థానంలో నిలువగా అనంతపురం జిల్లా 53 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2వ తేదీ నుంచి జరుగుతాయని మాణిక్యవరప్రసాద్ చెప్పారు. ఫీజు చెల్లించడానికి మే 7వ తేదీ చివరి గడువు. విద్యార్థుల మార్కుల జాబితాలు మే 4వ తేదీ నుంచి కళాశాలలకు చేరుకుంటాయని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X