హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మే 10న టిడిపి గ్రూపులో శ్రీకృష్ణ కమిటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikrishna
న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితిపై అధ్యయనానికి ఏర్పడిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులు మే 10వ తేదీన తెలుగుదేశం పార్టీ గ్రూపులతో సమావేశం కానుంది. తెలంగాణ, సీమాంధ్ర తెలుగుదేశం నాయకులకు శ్రీకృష్ణ కమిటీ ఒకే రోజు సమయం ఇచ్చింది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన నాయకులతో మే 10న శ్రీకృష్ణ కమిటీ హైదరాబాదులో సమావేశమై అభిప్రాయాలు సేకరిస్తుంది. ఒక్కో ప్రాంతానికి చెందిన నాయకులకు గంటన్నరేసి సమయాన్ని కమిటీ కేటాయించింది. ఈ మేరకు శ్రీకృష్ణ కమిటీ తెలుగుదేశం నాయకులకు సమాచారం అందించింది.

తెలుగుదేశం తెలంగాణ, సీమాంధ్ర నాయకులు విడివిడిగా శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు అందజేశారు. దీంతో తెలుగుదేశం పార్టీని ఒక పార్టీగా కాకుండా గ్రూపులుగా గుర్తించి కమిటీ సమయం కేటాయించింది. కాగా, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో క్షేత్ర పర్యటన చేసేందుకు సిద్ధపడుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X