వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజా స్కామ్: పార్లమెంటులో దుమారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంలో పాత్ర ఉన్న టెలికం మంత్రి ఎ రాజా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంటు ఉభయ సభల్లో సోమవారం దుమారం చెలరేగింది. సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో ఉభయ సభలు కూడా వాయిదా పడ్డాయి. సభలు సమావేశం కాగానే బిజెపి, అన్నాడియంకె సభ్యులు వార్తాపత్రికలను ప్రదర్శిస్తూ రాజాకు కుంభకోణంలో పాత్ర ఉందని ఆరోపిస్తూ మంత్రి రాజీనామా చేయాలని పట్టుబట్టారు.

లోకసభలో అన్నాడియంకె సభ్యులు రాజా రాజీనామాకు డిమాండ్ చేస్తుండగా ఎస్పీ, ఆర్జెడి, బిఎస్పీ, జెడి(యు) సభ్యులు కుల ప్రాతిపదిక జనాభా గణన కోసం డిమాండ్ చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లారు. స్పీకర్ మీరా కుమార్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. దీంతో ఆమె సభను వాయిదా వేశారు. స్పెక్ట్రమ్ కేటాయింపులపై రాజ్యసభలోనూ దుమారం చెలరేగింది. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X