వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర విభజన జరగదు: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విశాఖపట్నం: కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటనను బట్టి రాష్ట్ర విభజన జరగదని స్పష్టమై పోయిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయం కావాలని అంటున్నారని, మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని, అందువల్ల తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయం రాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

రాష్ట్ర విభజనపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల వెనక లాభాపేక్ష ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో బొత్స గాలివాటంగా ఉన్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గంలో మధుకోడాలున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు వ్యాఖ్యానించడం సరి కాదని ఆయన అన్నారు. ఆధారాలుంటే మధుకోడాలను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X