కర్నూలు: సుంకేశుల బ్యారేజీ సామర్థ్యం పెంచనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ఇందుకు 235 కోట్ల రూపాయలతో 25 అదనపు గేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఆగస్టులోగా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని ఆయన అన్నారు. తుంగభద్ర, హంద్రీనీవా నదుల వల్ల వరద ముప్పు రాకుండా కర్నూలు నగరానికి రక్షణ గోడ నిర్మిస్తామని ఆయన చెప్పారు.