నెల్లూరు: నెల్లూరులోని మిఠాయి వ్యాపారి ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. నెల్లూరులోని విజయమహల్ వద్ద గల మిఠాయి వ్యాపారి ఇంట్లో దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు ఇంట్లోవారిని కత్తులతో బెదిరించి 9 లక్షల రూపాయల నగదు, పది లక్షల రూపాయల విలువ చేసే బంగారం ఎత్తుకెళ్లారు.
పక్కింట్లో కూడా వారు దొంగతనానికి ప్రయత్నించారు. అయితే వారికి ఆ ఇంట్లో ఏమీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం గాలిస్తున్నారు.