హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలవరం డిజైన్ మారదు: పొన్నల

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు డిజైన్ లో ఏ విధమైన మార్పు ఉండదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కె. రోశయ్య మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. సమీక్ష వివరాలను పొన్నల లక్ష్మయ్య మీడియా ప్రతినిధులకు వివరించారు.

పోలవరం ప్రాజెక్టును 2014 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. జూన్ 30వ తేదీ నాటికి పోలవరం టెండర్ల ప్రక్రియ పూర్తవుందని, ఆ తర్వాత ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. పోలవరం సాధన కోసం ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బస్సు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X