రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవసరమైతే రైతుల వద్దకు చిరు పాదయాత్ర

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
రాజమండ్రి: చిరంజీవికి పోలవరం యాత్ర కలిసోస్తున్నట్టుగా ఉంది. రెండో విడత యాత్రలోనూ, ఎర్రటి ఎండల్లోనూ ఆయనకు స్వాగతించడానికి జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ జాతీయ హోదా కోసం అవసరమైతే రైతుల చెంతకు పాదయాత్ర చేస్తానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. ఆయన బుధవారం సామర్లకోటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పొన్నాల లక్ష్మయ్య ఒక ప్రాంతానికి కాకుండా రాష్ట్రానికి మంత్రినని నిరూపించుకోవాలన్నారు. పోలవరం జాతీయ హోదాపై ఆయన తన చిత్తశుద్ధిని చాటి చెప్పాలని చిరంజీవి డిమాండ్‌ చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధన కోసం ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చేపట్టిన బస్సుయాత్ర జిల్లాలోకి రెండోసారి ప్రవేశించింది. ఐదో తేదీన అంతర్వేదిలోయాత్రను ప్రారంభించిన చిరంజీవి ఏడో తేదీన విశాఖ జిల్లాకు వెళ్లారు. అనంతరం మళ్లీ సోమవారం అర్ధరాత్రి నర్సీపట్నం నుంచి అన్నవరం వచ్చారు. మంగళవారం ఉదయం సత్యదేవుని దర్శించిన అనంతరం జిల్లా యువరాజ్యం, మహిళారాజ్యం కార్యకర్తలతో సమావేశమయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన బస్సు యాత్ర రౌతులపూడి, శంఖవరం, ఒమ్మంగి, ప్రత్తిపాడు, కిర్లంపూడి, దివిలి మీదుగా అర్ధరాత్రికి పెద్దాపురం చేరుకుంది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X