హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ తెలంగాణలో తిరుగొద్దు: దామోదర్

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: సమైక్యవాదం వినిపిస్తున్న తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయన్ జగన్ తెలంగాణలో పర్యటించకూడదని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. సమైక్య నినాదం పలికే నేతలు తెలంగాణ ప్రాంతంలో పర్యటించవద్దని ఆయన కోరారు. తెలంగాణ కాంగ్రెసు నాయకుల సమావేశం ముగిసిన అనంతరం దామోదర్‌ రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో తెలంగాణవాదం బాగా పెరిగిందని, ఇలాంటి తరుణంలో తెలంగాణేతరులు యాత్రలు, పర్యటనలు చేయకూడదని కోరారు.

సమైక్యవాదాన్ని వినిపిస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో పాటు కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి కూడా సమైక్యవాదం వినిపిస్తే తెలంగాణలో పర్యటించొద్దని అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేయకుంటేనే మంచిదని, ఇదే అభిప్రాయాన్ని అధిష్ఠానానికి నివేదించనున్నట్లు చెప్పారు. మరోమారు ఈ నెల 17న తెలంగాణ జిల్లాల పార్టీ అధ్యక్షులతోపాటు జడ్పీ, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X