రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాలు వేరే: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
రాజమండ్రి: రాజకీయాలు వేరు, సినిమాలు వేరని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. పోలవరం సాధన కోసం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన గురువారం ఆ విధంగా అన్నారు. రాజకీయాల్లో ప్రతి సంఘటన ఓ కొత్త అనుభవాన్ని ఇస్తోందని ఆయన అన్నారు. ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేసిన సచార్ కమిటీ సూచనలను అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో ముస్లింలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు సాధన కోసం ఉద్యమిస్తున్న చిరంజీవిని మత పెద్దలు ఆశీర్వదించారు. కాగా, రాజమండ్రి మీడియా సమావేశానికి చిరంజీవి డుమ్మా కొట్టారు. చిరంజీవి రాకపోవడంతో మీడియా ప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X