కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వంపై పోరాటమే: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
పులివెందుల: తన నాన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ సక్రమంగా అమలయ్యేలా చూస్తానని, అ పథకాలన్నీ నిరుపేదలకు అందేలా చూస్తానని ఇందుకు అవసరమైతే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. పులివెందుల పట్టణంలోని జయమ్మ కాలనీలో బుధవారం ఆయన పర్యటించారు. కొద్దిరోజులు ఓపిక పడితే వృద్ధాప్య పింఛన్లు, బియ్యం కార్డులు, ఇందిరమ్మ గృహాలు అర్హులందరికీ అందేలా కృషిచేస్తానని, ప్రణాళిక సిద్ధం చేశానని జగన్‌ అన్నారు. ప్రజా సమస్యలపై స్పందించిన జగన్‌ అధికారులను పిలిపించి, ఈ పనులన్ని పూర్తి చేయాలని సూచించారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే మీరు కోరినట్లే న్యాయం చేసేవాడినని, ఇప్పుడు ప్రభుత్వం రోశయ్యదని, తానేమి చేయలేనని, ఈ విషయంలో మీతో పాటు నేను పోరాడేందుకు సిద్ధమే అని కడప మేయర్‌ రవీంద్రనాథరెడ్డి అన్నారు. కడప నగర శివార్లలో బుధవారం జరిగిన ప్రజాపథంలో ఆయన మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X