గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నాపై కేంద్రం విచారణ: రాయపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambhasiva Rao
గుంటూరు: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు, మంత్రి కన్నా లక్ష్మినారాయణ మధ్య కయ్యం మరింత ముదురుతోంది. కన్నా లక్ష్మినారాయణ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ ప్రారభించిందని రాయపాటి సాంబశివ రావు గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కన్నా లక్ష్మినారాయణపై తన పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. విచారణ పూర్తయిన తర్వాత కన్నా మెంటల్ ఆస్పత్రిలో చేరడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. 20 మంది అవినీతిపరుల పేర్లతో తాను రాసినట్లు బుధవారం విడుదలైన లేఖ తాను రాసింది కాదని ఆయన స్పష్టం చేశారు.

తన పేరు మీద విడుదలైన నకిలీ లేఖపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులే అసలు విషయం తేలుస్తారని ఆయన అన్నారు. కన్నా లక్ష్మి నారాయణపై తాను చేసిన అభియోగాలు వాస్తవమని ఆయన అన్నారు. కొన్నాళ్ల క్రితం రేకుల షెడ్డులో ఉన్న కన్నా లక్ష్మినారాయణ వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ఆయన అడిగారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంపాదించిన కన్నా లక్ష్మినారాయణ ఆస్తుల వివరాలు తేలాలని ఆయన అన్నారు. ఫోర్జరీ లేఖలో కొందరు మంత్రుల పేర్లు ఉన్నందుకు వారికి తాను క్షమాపణ చెబుతున్నానని, లేఖను తాను రాయకపోయినప్పటికీ తన పేరు మీద ఆ లేఖ విడుదలైనందున తాను క్షమాపణ చెబుతున్నానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X