వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వలస పక్షులే వెళ్లిపోతున్నాయి: చిరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ఏలూరు: తమ పార్టీ నుంచి వలస పక్షులే వెళ్లిపోతున్నాయని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. సొంత ప్రయోజనాలు ఆశించి పార్టీలోకి వచ్చినవారు వెళ్లిపోతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పార్టీ కోసం వచ్చిన వారు చురుగ్గా, కష్టపడి పని చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు కంటితుడుపుగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాదు ఐఎస్ఐ అడ్డాగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాదులో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన రమేష్ కు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X