హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రకు తుపాను ముప్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

Cyclone threat to Coastal Andhra
హైదరాబాద్: ఆంధ్ర తీర ప్రాంతానికి తుపాను ముప్పు పొంచి ఉంది. వచ్చే 49 గంటల్లో, ఈ నెల 19వ తేదీ నుంచి భీకరమైన గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం అండమాన్ దీవుల వద్ద అండమాన్ దీవుల వద్ద వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఆ వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. దీని ప్రభావం కోస్తాంధ్రపై, రాయలసీమపై తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా వేయి కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉంది. అది తుఫానుగా మారి ఆంధ్రలో తీరాన్ని దాటవచ్చునని అంటున్నారు. ఈ ముప్పు నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. సముద్రంలోకి వేటకు వెళ్లినవారిని తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. పెను గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X