ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఆంధ్రకు రావచ్చు: చిరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ఒంగోలు: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఆంధ్ర పర్యటనను ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్వాగతించారు. కెసిఆర్ ఆంధ్ర పర్యటనలో తప్పు లేదని ఆయన అన్నారు. ఈ నెల 29వ తేదీన కెసిఆర్ విజయవాడలో జరిగే జై ఆంధ్ర మహాసభకు రావాలని నిర్ణయించుకోవడంపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రతిస్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం చారిత్రక అవసరమని ఆయన అన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను తెచ్చేందుకు అఖిల పక్షంతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు. రైతుల జీవితాలు నిస్సారం అవుతుంటే ప్రభుత్వంలోని పెద్దలు భూసారం గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పొగాకు రైతుల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని ఆయన అన్నారు. పొగాకు పంటకు రైతులకు ఏటేటా ధరలు తగ్గుతున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X