జగన్ ను అడ్డుకునే హక్కుంది: దామోదర్

తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున నాయకుల పర్యటనలు కూడదని చెప్పారని, అందువల్ల జగన్ తెలంగాణలో జగన్ పర్యటించడం సరి కాదని ఆయన అన్నారు. జగన్ తన తెలంగాణ పర్యటనను విరమించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వకూడదని ఆయన కోరారు. ప్రస్తుతం తెలంగాణలోని గ్రామగ్రామాన ఉద్రిక్త వాతావరణం ఉందని, అందువల్ల తెలంగాణలో సీమాంధ్ర నాయకులు పర్యటించడం మంచిది కాదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ తెలంగాణ పర్యటన తమ పార్టీకి అనుకూలమా, ప్రతికూలమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం కాదని, ఉప ఎన్నికలపై తమ పార్టీ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆ విషయం చూసుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని, అంతర్యుద్ధం తలెత్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్ చేసిన ప్రకటనతో ఆయన ఏకీభవించారు.












Click it and Unblock the Notifications