హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ యాత్రనే వ్యతిరేకిస్తున్నా: ఎర్రబెల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణలో తాను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలంగాణ పర్యటనను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు తెలుగుదేశం తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. ఇతర సీమాంధ్ర నాయకుల పర్యటనలను తాను వ్యతిరేకించడం లేదని, ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో భేటీ అనంతరం ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించి ఏడెనిమిది నెలలు అవుతోందని, ఇప్పుడు వైయస్ మరణం వల్ల షాక్ కు గురై మరణించిన వారిని పరామర్శించడంలో అర్థం లేదని ఆయన అన్నారు. ఒక్కవేళ ఆ కుటుంబాలకు జగన్ సాయం చేయాలనుకుంటే హైదరాబాదు పిలిపించుకుని చేయాలని ఆయన అన్నారు.

జగన్ ఒక్కరే వ్యక్తిగతంగా వచ్చి బాధితులకు సాయం అందించినా తనకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర రాజకీయార్భాటంతో సాగుతుంది కాబట్టే తాను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలో బాబ్లీ సహా 12 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించడానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వీలు కల్పించారని, దీనివల్ల తెలంగాణ, ముఖ్యంగా తమ వరంగల్ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని, అటువంటి వైయస్ కుమారుడు జగన్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తానంటే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. వైయస్ వరంగల్ జిల్లాలోని పరిశ్రమలను విక్రయించారని, భూములను కబ్జా చేయించారని, తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ స్థితిలో జగన్ వరంగల్ జిల్లా పర్యటన మంచిది కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X