ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవిని అడ్డుకోండి: టిఆర్ఎస్

By Santaram
|
Google Oneindia TeluguNews

Khammam dist
ఖమ్మం: ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఖమ్మం జిల్లాలో చేపట్టనున్న యాత్రను అడ్డుకోవాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్‌ విజయరామారావు పిలుపునిచ్చారు. ఖమ్మంలో బస్టాండ్‌ ఎదురుగా నిర్వహించిన టీఆర్ ‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నీటిని కోస్తాంధ్రకు తరలించుకెళ్లే కుయుక్తుల్లో భాగంగానే చిరంజీవి యాత్ర చేపట్టదలిచారని ఆరోపించారు. జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైం దని విమర్శించారు.

జిల్లాకు సాగు నీరందించే ఇచ్చంపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నారు. తాలిపేరు ప్రాజెక్టు కూడా అసంపూర్తిగా ఉం దని, సాగు నీరు అందక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్‌ 31 నాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమించేందుకు పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ నెల 31వ తేదీ నాటికి అన్ని మండలాల్లో పార్టీ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని కార్యకర్తలను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X