హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏమిటా మన్మోహన్ మాటలు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మాటల్లో పొంతన లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. యుపిఎ ఏడాది పాలనపై ప్రధాని ప్రవేశపెట్టిన నివేదిక పేలవంగా ఉందని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మంగళవారం మాట్లాడారు. ప్రధాని నివేదిక వాస్తవాలకు దూరంగా ఉందని ఆయన అన్నారు. ఒక వైపు తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటూనే మరోవైపు రాహుల్ అన్ని విధాలా అర్హుడు, రాహుల్ వస్తే తప్పుకుంటానని అనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే అభివృద్ధి ఆగిపోయిందని ఆయన విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రంగారెడ్డి జిల్లా తమ పార్టీకి కంచుకోట అనే విషయం రుజువైందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X