హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ తెలంగాణ యాత్రకు ప్రభుత్వ అనుమతి నిరాకరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ అనుమతి నిరాకరించినట్లు చెబుతున్నారు. అవసరమైతే జగన్ ను హౌస్ అరెస్టు కూడా చేయాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ చేత యాత్రను వాయిదా వేయించడానికి ప్రభుత్వం తరఫున మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, రఘువీరా రెడ్డి జగన్ తో మాట్లాడుతున్నారు. జగన్ వినకుండా యాత్రకు బయలుదేరితే హౌస్ అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ బస్ స్టాండ్ వద్ద బాంబు పెట్టి ఉన్న ఓ సంచీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిలో టైంబాంబు ఉన్నట్లు వారు గుర్తించారు. జగన్ యాత్ర సందర్భంగా వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితిలో మంత్రులకు ముఖ్యమంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జగన్ యాత్ర వల్ల ఏదైనా జరిగితే బాధ్యత మంత్రులదేనని ఆయన హెచ్చరించినట్లు చెప్పారు. మంత్రులకు హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X