వైయస్ జగన్ తెలంగాణ యాత్రకు ప్రభుత్వ అనుమతి నిరాకరణ
కాగా, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ బస్ స్టాండ్ వద్ద బాంబు పెట్టి ఉన్న ఓ సంచీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిలో టైంబాంబు ఉన్నట్లు వారు గుర్తించారు. జగన్ యాత్ర సందర్భంగా వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితిలో మంత్రులకు ముఖ్యమంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జగన్ యాత్ర వల్ల ఏదైనా జరిగితే బాధ్యత మంత్రులదేనని ఆయన హెచ్చరించినట్లు చెప్పారు. మంత్రులకు హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
Story first published: Thursday, May 27, 2010, 16:43 [IST]