హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ యాత్రపై అమీతుమీకే జగన్ నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తెలంగాణలోని వరంగల్ జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్రపై అమీతుమీ తేల్చుకోవడానికే కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. యాత్రను వాయిదా వేసుకోవాలనే పార్టీ అధిష్టానం సూచనను బేఖాతరు చేయడానికే ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఆయన శుక్రవారం నుంచి వరంగల్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఇతర పార్టీల తెలంగాణ నాయకులే కాకుండా కాంగ్రెసు పార్టీలోని తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు.

యాత్రను వాయిదా వేసుకోవాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ చేసిన సూచనపై తన అనుచరులతో మాట్లాడి చెబుతానని జగన్ చెప్పారు. ఆ వెంటనే ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. యాత్రను వాయిదా వేసుకోవద్దని జగన్ కు అనుచరులు సూచించినట్లు తెలుస్తోంది. జగన్ వరంగల్ జిల్లా యాత్ర సాగుతుందని సీమాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యుడు ఎరాసు ప్రతాప రెడ్డి చెప్పారు. అలాగే, జగన్ యాత్రను ఆపాలని గానీ యాత్రలో పాల్గొనవద్దని గానీ తమకు అధిష్టానం నుంచి ఏ విధమైన ఆదేశాలు రాలేదని వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే జగన్ యాత్రను కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X