వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కు షరతులతో కాంగ్రెసు హైకమాండ్ అనుమతి?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: తీవ్రమైన ఒత్తిడితో తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ యాత్రకు కాంగ్రెసు అధిష్టానం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. తమ షరతులకు లోబడి మాత్రమే జగన్ వరంగల్ జిల్లాలో ఓదార్పు యాత్ర చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు కెవిపి రామచందర్ రావు, పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామి రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెసు పెద్దలను కలిసి జగన్ పర్యటనకు అనుతించాలని కోరినట్లు తెలుస్తోంది.

శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఓదార్పు యాత్ర సాగాలని పార్టీ ఆదేశించినట్లు సమాచారం. జగన్ రూట్ మ్యాప్ ను మార్చుకోవాలని, అలాగే యాత్ర పరిధిని కూడా మార్చుకోవాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉండకూడదని చెప్పినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X