హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ తెలంగాణ యాత్ర వ్యక్తిగత లాభం కోసమేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వ్యక్తిగత ప్రయోజనం కోసమే కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వరంగల్ జిల్లాలో ఓదార్పు యాత్రను తలపెట్టారని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దానివల్లనే ఆయన యాత్రకు బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. జగన్‌ పర్యటన వల్ల పార్టీకి ఏ మాత్రం ప్రయోజనం కూడా లేదని ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఇటీవల ఢిల్లీ పర్యటనలో పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. జగన్ తెలంగాణ యాత్ర చేయాలని గానీ వద్దని గాన తాను చెప్పబోనని, అక్కడి ప్రజల స్పందనను చూసి జగనే ఆ విషయంపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దీన్ని బట్టి ఆయన జగన్ యాత్రకు ఏ మాత్రం అనుకూలంగా లేరని అర్థం చేసుకోవచ్చు.

ఓదార్పుయాత్ర పేరుతో జగన్‌ పర్యటిస్తున్న తీరుపైనా అధిష్ఠానానికి ఇప్పటికే చాలా ఫిర్యాదులందినట్లు తెలుస్తోంది. యాత్ర రాజకీయ పర్యటనలాగా ఉంటోంది తప్ప పరామర్శలకు పరిమితం కావడం లేదని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. పర్యటనకు జగన్ పోస్టర్లు తదితర హంగులతో ఆర్భాటం చేస్తున్నారని, అది వ్యక్తిగత పర్యటనలాగా లేదని పార్లమెంటు సభ్యులు చెప్పినట్లు సమాచారం.

ఓదార్పుయాత్రను పార్టీతో సంబంధం లేని వ్యక్తిగత పర్యటనగా జగన్‌ చెప్పటాన్ని కొందరు కాంగ్రెసు నాయకులు తప్పుపడుతున్నారు. అందరూ ఇలా సొంత పర్యటనలు చేసుకుంటూ వెళ్తే చివరకు పార్టీయే ఉండదని హెచ్చరిస్తున్నారు. జగన్‌ పర్యటన వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందన్న డీజీపీ వ్యాఖ్యలు కూడా అధిష్ఠానంపై ప్రభావం చూపి ఉండవచ్చునని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X