హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాణాలైనా ఒడ్డి జగన్ యాత్రను అడ్టుకుంటాం: ఒయు జెఎసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను అడ్డుకుని తీరుతామని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) నాయకులు చెప్పారు. అందుకు ప్రాణాలైనా అర్పిస్తామని వారు హెచ్చరించారు. జగన్‌ వరంగల్‌ వస్తే వరంగల్‌ను దిగ్బంధం చేస్తామన్నారు. జగన్ ఓదార్చేందుకు రానున్న మహబూబాబాద్‌కు తాము కూడా వెళ్లి నిరసన తెలుపుతామని వారు చెప్పారు.

కాగా, తెలంగాణవాదులు జగన్ తెలంగాణ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలనే ఎత్తుగడతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కు నిరసన తెలియజేస్తూ జిల్లాలో చెప్పుల దండలు వేలాడ దీశారు. వాల్ పోస్టర్లు వేశారు. వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. ఈ స్థితిలో శాంతిభద్రతలపై నిఘా విభాగం ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X