జగన్ కాన్వాయ్ ని పేల్చేస్తాం: తెలంగాణ లిబరేషన్ ఆర్మీ
నల్లటి బ్యాగులో మహబూబా బాద్ నాలుగో నెంబర్ ఫ్లాట్ ఫారంపై ఉన్న బాంబు పోలీసులకు చిక్కింది. దీంతో పోలీసులు బస్సు స్టాండు నుంచి ప్రజలను బయటకు పంపించి వేశారు. అక్కడే పోలీసులకు తెలంగాణ లిబరేషన్ ఆర్మీ పేర ఓ లేఖ దొరికింది. జగన్ కాన్వాయ్ ని పేల్చేస్తామంటూ ఆ లేఖలో రాసి ఉంది. లేఖలోని పూర్తి వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు.
తెలంగాణ లిబరేషన్ ఆర్మీ పేర ఏ సంస్థ కూడా లేదని అంటున్నారు. బాంబు ఎవరు పెట్టి ఉంటారనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసాంఘిక శక్తులా, మరెవరనేది వారు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం మహబూబా బాద్ లో జగన్ పర్యటించనున్న నేపథ్యంలో ఈ బాంబు లభించడం ఆందోళనకు గురి చేస్తోంది.
Comments
Story first published: Thursday, May 27, 2010, 17:20 [IST]