కెవిపి రామచందర్ రావు మాట వినని వైయస్ జగన్

KVP Ramachandar Rao
హైదరాబాద్: వరంగల్ జిల్లా ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండి పట్టు పట్టారు. ఎవరు చెప్పినా వినకుండా తన యాత్రను ఆయన ప్రారంభించారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు కోరినా వరంగల్ జిల్లా యాత్రను వాయిదా వేసుకోవడానికి జగన్ ఇష్టపడలేదు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కెవిపితో మాట్లాడి జగన్ ను ఒప్పించాలని సూచించినట్లు సమాచారం. దీంతో కెవిపి రామచందర్ రావు గురువారం సాయంత్రం జగన్ ను కలిశారు. యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించినట్లు సమాచారం.

జగన్ తన మాట వినకపోవడంతో కెవిపి తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. జగన్ ఎటు వెళ్తారో తనకు తెలియదని కెవిపి రామచందర్ రావు జగన్ తో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. దీన్నిబట్టి కెవిపి జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితులైన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, రఘువీరా రెడ్డి చెప్పినా జగన్ వినలేదు. దీన్ని బట్టి జగన్ ఎవరిని కూడా ఖాతరు చేసే స్థితిలో లేరని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+