వైయస్ జగన్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు

జగన్ యాత్ర సందర్భంగా మహబూబాబాద్ లో, వరంగల్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్నాయి. వరంగల్ కోర్టులో న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అడ్డుకున్నారు. ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. కోర్టు ఆవరణలో జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జగన్ యాత్రను అడ్డుకోవడానికి తెలంగాణవాదులు పెద్ద యెత్తున మహబూబాబాద్ చేరుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళన పరిస్థితి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications