వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ మొండిగా వ్యవహరించారు: మంత్రి వెంకటరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధిష్టానం చెప్పినా వినకుండా మొండిగా వ్యవహరించారని రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ భవిష్యత్తు ఉన్న నాయకుడని, అందువల్ల జగన్ ఓపికతో, ఆలోచనతో ముందుకు సాగాల్సి ఉంటుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుని ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.

జగన్ కు ఆవేశం కూడదని, ఆలోచన కావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది సరి కాదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా రాజకీయం కోసమే కొందరు గొడవ చేశారని, దాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ తన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుని ఉండాల్సిందని మరో మంత్రి దానం నాగేందర్ కూడా అన్నారు. పార్టీ అధిష్టానం మాటను జగన్ విని ఉండాల్సిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X